17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పట్టణ బీజేపీ నూతన కార్యవర్గం ఎన్నిక

15-05-2025 07:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నూతన పట్టణ కార్యవర్గం ఎన్నికైన శుభ సందర్భంగా వారికి పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో బిజెఎల్పీ నేత ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Sri Alleti Maheshwar Reddy) ఆదేశాల మేరకు నిర్మల్ పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాబోవు రోజుల్లో పార్టీ పటిష్టం బలోపేతం కోసం తమవంతుగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా ఒల్లెపు తిరుపతి, రావుల విట్టల్, మగ్గిడి భూమేష్ వడ్నాల రాము ప్రధాన కార్యదర్శులుగా కొండా జి శ్రావణ్ కార్యదర్శులు వెంకట్ కందుల రవి, గంజి రాము, దోమకొండ రాకేష్ తో పాటు 45 మంది పట్టణ కమిటీ సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.