24-06-2025 02:21:08 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బన మండలం పులికుంట గ్రామానికి చెందిన కుందారపు శంకరమ్మ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్బంగా మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.సంఘమ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.మున్నూరు కాపు సంఘం సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.