calender_icon.png 24 June, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు..? : ఎంపీ ఈటల

24-06-2025 03:13:54 PM

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఈటల వాంగ్యూలాన్ని అధికారులు నమోదు చేశారు. కాళేశ్వరంపై వేసిన కమిటీ నివేదికను ఇంకా బయటపెట్టలేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావు.. ఐపీఎస్ అధికారి కాకపోయినా ఎస్ఐబీ చీఫ్ గా నియమించారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.  విశ్రాంత అధికారిని ఎస్ఐబీ చీఫ్ గా అక్రమంగా నియమించారని, గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ వద్దనే ఉందన్నారు.

ఫోన్లు ట్యాపింగ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారు..? ఆయన ప్రశ్నించారు. జడ్జిలు, మంత్రులు, పార్టీల ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి, వారికి సంబంధించిన కాల్ డేటాలో చూపించారని ఈటల అన్నారు. హుజూరాబాద్ లో, 2023 గజ్వేల్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారని, మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తమ పార్టీ నాయకులు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారనేది ట్యాపింగ్ ద్వారా తెలుకున్నారన్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.