12-06-2025 08:14:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరుకావాలని పరీక్షల సహాయ కమిషనర్ సోమవార్ పేట్ ప్రధాన ఉపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్ అన్నారు. గురువారం పట్టణంలోని సోము వారి పెట్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని అభ్యర్థించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను, యూనిఫామ్ లను అందచేయుచున్నదని అన్నారు. ఉదయం విద్యార్థులకు రాగిజావ తో పాటు మధ్యాహ్నం శూచి, రుచికరమైన భోజనాన్ని కూడా ఇస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు పాఠశాలలో కంప్యూటర్ ఆధారిత కృత్రిమ మేధ విద్య బోధించబడుచున్నదని వెల్లడించారు.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చే బోధనగావించబడుచున్నదని, విద్యార్థులు పాఠ్యరంగాలతో పాటు సహ పాఠ్య కార్యకలాపాలలో రాణించేలా వారిని తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో విద్యార్థుల మానసిక, ఆరోగ్య, శారీరక పెంపుదలకు యోగా, క్రీడా,సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయని చెప్పారు. వీటన్నిటిని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ,అందుకు తమ బడిఇడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని కోరారు. ప్రైవేట్ పాఠశాల పై గల మోజును వీడాలని,ఆర్థికగా భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలను ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ఉపాధ్యాయులు జాఫర్, మనోహర్ రెడ్డి ,లక్ష్మణ్ ,ఉజ్మా, శకుంతల ,నివేదిత లతోపాటు పోషకులు, స్థానిక ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు