15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

అత్యవసర చికిత్సపై అవగాహన ఉండాలి

16-10-2025 08:32 AM

మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ కిరణ్ 

మంచిర్యాల, (విజయక్రాంతి): అత్యవసర వైద్యంపై(Emergency Treatment) ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ సూచించారు. బుధ వారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో  మంచిర్యాల పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో సిపిఆర్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా హార్ట్ ఎటాక్ కు గురైతే అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ ఎలా చేయాలనే ఆందోళన ఉంటుందని, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సిపిఆర్ శిక్షణ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిపిఆర్ పై అవగాహన ఉంటే కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, శ్రీనివాస్, 130 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.