16-10-2025 08:34:30 AM
సిర్పూర్ యు,(విజయక్రాంతి): మండలం లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతా దారులు రీ కేవైసీ త్వరగా చేసుకోవాలని మేనేజర్ గజేంద్ర సొలంకి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ తెలంగాణ బ్యాంక్ లో సుమారు 8000 మంది ఖాతా దారులు రీ కేవైసీ చేయాల్సి ఉందన్నారు.రీ కేవైసీ చేయకపోతే ఖాతా లావాదేవీలు ఆగిపోయి తమ ఖాతా లో ఉన్న డబ్బులు డి.ఇ.ఎ.ఎఫ్ ప్రభుత్వ ఖాతా లో జమ అవుతాయి అన్నారు. కాగా ఖాతా దారులందరు బ్యాంక్ కు వచ్చి త్వరగా రీ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు.