06-06-2025 01:07:59 AM
డీఈవో, ఎంఈవో, హెచ్ఎంలకు అధికారులు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను క్ర మం తప్పకుండా హెచ్వోడీలు, జిల్లా, మండల విద్యాధికారులు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (ఎల్ఐపీ) కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని సూచించా రు.
ఈ మేరకు గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. అడిషనల్ డైరెక్టర్లు, ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈ వోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఇక నుంచిడి క్రమం తప్పకుండా స్కూ ళ్లను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలన్నారు. అం తేకాకుండా తరగతి గదిలో టీచర్ల బోధనా పద్ధతులను సైతం తరచూ పరిశీలించాలని పేర్కొన్నారు. నెలకు 8 నుంచి 24 స్కూళ్లను ఒక్కో అధికారి విజిట్ చేయాలని తెలిపారు.