calender_icon.png 25 June, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిష్య శాస్త్రంలో ముత్తన్నకు డాక్టరేట్

25-06-2025 06:04:48 PM

బోథ్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన జ్యోతిష్య శాస్త్ర వాస్తు పండితుడు బిట్లింగు ముత్తన్న కు డాక్టరేట్ లభించింది. వరల్డ్ చారిటీ ఫౌండేషన్(World Charity Foundation) వారు బుధవారం ఈసీల్  సికింద్రాబాద్ లో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో చారిటీ చైర్మన్ చంద్ర శేఖరం(Chairman Chandra Sekharam) చేతుల మీదుగా ముత్తన్నకు డాక్టరేట్ అందించారు. జ్యోతిష్య శాస్త్రంలో ముత్తన్న చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించిందని తెలిపారు. కాగా వాస్తు శాస్త్రంలో రాష్ట్ర జాతీయ అవార్డులతో పాటు డాక్టరేట్ పొందడంపై పొచ్చర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టరేట్ రావడంతో నాపై మరింత బాధ్యత పెరిగిందని వాస్తు శాస్త్రంలో ప్రజలకు మరింత సేవ చేస్తానని డాక్టర్ ముత్తన్న పేర్కొన్నారు.