25-09-2025 12:04:16 AM
మనోహరాబాద్, సెప్టెంబర్ 24 :మనోహరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ దుర్గాదేవి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళల పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఇందులో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.