17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నవదుర్గ మాత శక్తిపీఠం ఏర్పడటం మన అదృష్టం..

13-05-2025 10:37 PM

మాజీ మంత్రి జోగు రామన్న..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): నవదుర్గా మాత ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దుర్గ గర్ లోని శ్రీ నవశక్తి మత ఆలయంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు శ్రీ కిషన్ మహరాజ్ నేతృత్వంలో నవశక్తి మత పీఠాన్ని ఊరేగిస్తూ, అమ్మవారి కొలువుదీరిన సందర్భంగా భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని సల్గిస్తోందని మాజీ మంత్రి రామన్న పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తూ పాడి పంటలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి కిషన్ మహారాజ్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. దిన దిన అభివృద్ధి చెందుతుందన్నారు.