calender_icon.png 1 September, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలి

01-09-2025 01:52:11 PM

పోలీస్ సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలి..

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar)  పేర్కొన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం వరకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, పెట్రో కార్, బ్లూ క్లోట్స్ సిబ్బంది, 24/7 పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు విద్యుదీకరణ జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ప్రతి మండపాల వద్ద నిర్వాహకులు అందుబాటులో ఉండాలని అన్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే  చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామనీ పలు జాగ్రత్తలపై నిర్వహులకు సూచించారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. నిమజ్జనం వరకు పోలీస్ వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, యస్బి సిఐ రాము,నల్లగొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, తదితరులున్నారు.