14 April, 2026 | 5:17 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

కంటా కాక లారీలు రాక

22-11-2025 04:35 PM

15 రోజుల నుండి రైతుల అవస్థలు..

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం..

సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడి సింగిల్ విండో పరిధిలో ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. గత 15 రోజుల నుండి ధాన్యం కంటా కాకా పోవడం వల్ల రైతులు కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. సమస్య ను సింగల్ విండో అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వెలల్లో మహిళ రైతులు కల్లాల వద్ద కాపలా ఉండటం ఇబ్బందిగా ఉందని, చలి తీవ్రత అధికంగా ఉండటం వలన రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి ధన్యన్ని వెంటనే తరలించే విదంగా చర్యలు తీసుకోవాలి రైతులు కోరుతున్నారు. ఈ మేరకు రైతులు పద్మాజీవాడి రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన కల్లాల వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కంటా చేసి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని లేనిచో రోడ్డుపై బైటహిస్తమన్నారు.