14 July, 2026 | 7:17 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

నెమ్మికల్ దండు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

08-08-2025 07:50 PM

ఆత్మకూర్ (విజయక్రాంతి): మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ గా మండల కేంద్రనికి చెందిన తంగెళ్ల కర్ణాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా నెమ్మికల్ గ్రామానికి చెందిన ఎరకల సర్వయ్య గౌడ్ తో పాటు 13 మంది డైరెక్టర్ లు శుక్రవారం ఎండోమెంట్ అధికారి కుశలయ్య ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నా ఎన్నికకు సహకరించిన నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, పిసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో కుశలయ్య,మండల కాంగ్రెస్ నాయకులు కొణతం ప్రతాపరెడ్డి, కాకి లక్ష్మి, తంగెళ్ళ లక్ష్మమ్మ,వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.