2 May, 2026 | 7:26 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

క్రాంతి విద్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

08-08-2025 07:48 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలోని క్రాంతి విద్యాలయం(Kranthi Vidyalayam)లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ పానుగంటి సమతా శ్రీనివాస్ అధ్యక్షతన ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలికలు తమ సహ విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షణ బంధనాన్ని గుర్తు చేస్తూ సోదరత్వాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సమత మాట్లాడుతూ, మన భారతీయ సాంప్రదాయాలలో రాఖీ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, భద్రతకు నిదర్శనం అని మన సాంప్రదాయాలలో ఎంతో గొప్పతనం ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సోమరౌత్ శ్రీనివాసరావు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ. హేమ శిల్ప మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు