26-05-2025 12:46:18 AM
వలిగొండ, మే 25 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ముద్దాపురం గ్రామంలోని న్యూ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీని స్థాపించడం అభినందనీయమని, ఇండస్ట్రీ ద్వారా రైతులకు సేవలను అందిస్తూ వ్యాపారంలో అభివృద్ధిని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.