calender_icon.png 3 June, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రారంభించిన మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే కుంభం

26-05-2025 12:46:18 AM

వలిగొండ, మే 25 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ముద్దాపురం గ్రామంలోని న్యూ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీని స్థాపించడం అభినందనీయమని, ఇండస్ట్రీ ద్వారా రైతులకు సేవలను అందిస్తూ వ్యాపారంలో అభివృద్ధిని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.