17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రేమ పెళ్లి.. భర్త, అత్త వేధింపులతో నవ వధువు బలి

18-12-2025 07:17 PM

శవాన్ని వదిలేసి పరారైన భర్త..

తాండూరు (విజయక్రాంతి): అవును.. వారిద్దరు ప్రేమించుకున్నారు, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ప్రియురాలితో ప్రమాణం కూడా చేశాడు.. పెద్దలను ఎదిరించి, ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. మోజు తీరాక కట్నం, బంగారం తీసుకురావాలంటూ భార్యను భర్త, అత్త కలిసి శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేసి భర్త కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ నవవధువు నేలరాలింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో గురువారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం కరణ్ కోర్ట్ గ్రామానికి చెందిన అనూష(22) సాయిపూర్ నివాసి అయిన పరమేష్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అనూష కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు.

ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని అనూష మొండికేయడంతో ఒప్పుకున్న తల్లిదండ్రులు బంగారం నగదు ఇచ్చి 8 నెలల క్రితం పెళ్లి ఘనంగా చేశారు. అదనంగా కట్నం తీసుకురావాలని అనూషకు భర్త పరమేష్ తో పాటు అత్త నిత్యం వేధించేవారు. కుటుంబ పెద్దల సమక్షంలో ఇరువురిని సముదాయించి అనూషను అత్తారింటికి పంపారు. అయితే గతం బుధవారం రాత్రి అనూషను భర్త, అత్త ఇద్దరు కలిసి తీవ్రంగా కొట్టడంతో ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. అదే రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి భర్త, అత్త ఇద్దరు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బంధువులు గురువారం ఉదయం వచ్చి చూసే సరికి అప్పటికే అనుష మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని బంధువులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.