15 June, 2026 | 11:41 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రేమ పెళ్లి.. భర్త, అత్త వేధింపులతో నవ వధువు బలి

18-12-2025 07:17 PM

శవాన్ని వదిలేసి పరారైన భర్త..

తాండూరు (విజయక్రాంతి): అవును.. వారిద్దరు ప్రేమించుకున్నారు, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ప్రియురాలితో ప్రమాణం కూడా చేశాడు.. పెద్దలను ఎదిరించి, ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. మోజు తీరాక కట్నం, బంగారం తీసుకురావాలంటూ భార్యను భర్త, అత్త కలిసి శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేసి భర్త కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ నవవధువు నేలరాలింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో గురువారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం కరణ్ కోర్ట్ గ్రామానికి చెందిన అనూష(22) సాయిపూర్ నివాసి అయిన పరమేష్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అనూష కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు.

ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని అనూష మొండికేయడంతో ఒప్పుకున్న తల్లిదండ్రులు బంగారం నగదు ఇచ్చి 8 నెలల క్రితం పెళ్లి ఘనంగా చేశారు. అదనంగా కట్నం తీసుకురావాలని అనూషకు భర్త పరమేష్ తో పాటు అత్త నిత్యం వేధించేవారు. కుటుంబ పెద్దల సమక్షంలో ఇరువురిని సముదాయించి అనూషను అత్తారింటికి పంపారు. అయితే గతం బుధవారం రాత్రి అనూషను భర్త, అత్త ఇద్దరు కలిసి తీవ్రంగా కొట్టడంతో ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. అదే రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి భర్త, అత్త ఇద్దరు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బంధువులు గురువారం ఉదయం వచ్చి చూసే సరికి అప్పటికే అనుష మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని బంధువులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.