15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

రైల్వే అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

03-01-2026 03:54 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): బెల్లంపల్లి ఏరియా రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్  గోపి , రైల్వే ఎస్సై రాథోడ్ మోహన్ ని బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో రెబ్బెన మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలుపాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గోడిసెల వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజా గౌడ్, యూనియన్ నాయకులు శంకర్, విజయ్, సంతోష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.