15 April, 2026 | 12:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అయ్యప్ప ఆలయంలో మహా అన్నదానం

03-01-2026 03:58 PM

కేసముద్రం, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయంలో గురు స్వామి బోగోజు నాగేశ్వర చారి జన్మదినాన్ని పురస్కరించుకొని సందర్భంగా కేసముద్రంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుముడి ధరించినందుకు ఆలయానికి వచ్చిన అయ్యప్ప మాలదారులతో పాటు వారి బంధువులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు పోలేపల్లి యాకూబ్ రెడ్డి, పొదిల నరసింహారెడ్డి, పెరుమాండ్ల ఎల్లగౌడ్, ఇనుగుర్తి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కూరెల్లి సతీష్, కేసముద్రం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, గాంతి వెంకటరెడ్డి, చింతా కరుణాకర్, కొత్తపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.