28-06-2025 12:00:00 AM
బిల్లులు రాకుంటేనా ఇల్లు అమ్మి బిల్లులు అందిస్తాం
మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట.జూన్ 27(విజయక్రాంతి); ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వంనుండి బిల్లులు వస్తా యా రావా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మి మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజ న మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు .
శుక్రవారం మధ్యా హ్నం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ మహిళల లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు అందించి ఆయన మాట్లాడుతూ మంజూరైన ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని మక్తల్ కు మొదటి విడత లో 291 ఇండ్లు మజురైనాయని వీటిని పూర్తిచేసి మళ్లీ కొత్త ఇండ్లను మంజూరి చేయడానికి కలెక్టర్ తో మాట్లాడానని అన్నారు.
తమ ప్రభుత్వం వచ్చిన 18 నెల్లోనే ఇందిరమ్మ ఇళ్ల ప్రాసిడింగులను లబ్ధిదారులకు అంద చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వము పేదలకు అండగా ఉండే ప్రభుత్వం అని మాటలు చెప్పెప్రభుత్వం కాదనడానికి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయడం నిదర్శనమన్నారు .
ఇప్పటివరకు రైతులకు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని ప్రస్తుతం రైతులు రైతు భరోసా అందించి సాగుకు సాయం అందించిన ఘనత తమదేనని ఆయన అన్నారు, అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకుంటే బిల్లులను విడుతల వారీగా లబ్ధిదారుల ఖాతాకు జమ చేస్తుందని అందుకు ప్రతి ఒక్కరూ ఇళ్ళనిర్మాణం పూర్తి చేసుకోవాలని బిల్లుల పై అపోహలు వద్దని విడతల వారిగా బిల్లులు వస్తాయని ఆమె పేర్కొన్నారు.
అనంతరం మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ లను అందజేశారు.ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్,స్థానిక ఎంపీడీవో. మున్సిపల్ కమిషనర్. పార్టీ కార్యకర్తలు నాయకులుపాల్గొన్నారు.