28-06-2025 12:00:00 AM
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, జూన్27 (విజయక్రాంతి): ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ’ విజయ క్రాంతి’ దినపత్రిక పనిచేస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ’విజయక్రాంతి ’పత్రికను చదివారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ’విజయక్రాంతి’ కృషిని అభినందించారు. కార్యక్రమంలో విజయక్రాంతి ములుగు స్టాఫ్ రిపోర్టర్ శ్యా , వివిధ మండలాల రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.