07-06-2025 12:00:00 AM
-ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రొటోకాల్ పాటించని అధికా రులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మె ల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీ, దగా, రౌడీ రాజకీయం ఎక్కువయ్యాయన్నారు. ప్రజా పాలనలో ప్రోటోకాల్ పాటించడం లేదని నియోజకవర్గ శాసనసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్కు సంబంధించిన నాయకులకు ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, భూమి పూజ చేయించడం దుర్మార్గం అని విమర్శించారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోనే కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారని తెలిపారు. ప్రొటోకాల్ పాటించని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు అలీబిన్ అహ్మద్, సంజీవ్, సిర్పూర్ యు మాజీ జెడ్పీటీసీ కోవ అరుణ, నాయకులు రవీందర్, ఇంతియాజ్ లాలా, శ్రీధర్, పోచయ్య, అహ్మద్, నారాయణ, భీమేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.