17 April, 2026 | 11:50 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రైవేటు పాఠశాలల అక్రమాలకు అండగా అధికారులు

27-06-2025 12:26 AM

రికగ్నయిజేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా నిర్లక్ష్యం 

 గజ్వేల్, జూన్ 26: ప్రభుత్వ పాఠశాలల అక్రమాలకు జిల్లా, మండల విద్యాధికారులు అండగా నిలుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూళ్ల గురించి మండల విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  రికగ్నైజేషన్ కోసం ఆయా పాఠశాలను ఇచ్చిన నివేదికలో  వెల్లడించిన దానికంటే తరగతుల వారిగా ఎక్కువ ఫీజులు, ఇతర వసూలు చేసిన ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని నిబంధన ఉన్నా మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారి ఈ విషయాన్ని పరిశీలించకపోవడం గమనార్హం.

రికగ్నైజేషన్ నిబంధన ప్రకారం ఆయా ప్రైవేటు పాఠశాలలు ప్రతి సంవత్సరం  ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అకౌంట్ బుక్స్ ను డి ఈ ఓ,  ఎంఈఓకు సమర్థించాల్సి ఉన్నా ఏ ఒక్క పాఠశాల కూడా తమ లావాదేవీలకు సంబంధించిన వివరాలను జిల్లా విద్యాధికారికి గాని,  మండల విద్యాధికారికి గాని అందజేయడం లేదు.  స్వచ్ఛంద సంస్థల పేరిట రిజిస్టర్ చేసుకుని విద్యను వ్యాపారంగా మార్చి లావాదేవీలను కొనసాగిస్తున్న ప్రైవేటు పాఠశాల అక్రమాలు వర్ణానాతీతం. అధికారుల అండతోనే  ఆయా ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయ న్నది అక్షరసత్యం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యాధికారుల తీరులో మార్పు వస్తే కానీ ఈ పరిస్థితులు మారే అవకాశం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులు కట్టలేనివారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరవచ్చుగా : ఎంఈఓల సలహా 

అధిక ఫీజుల వసూళ్ల  పై చర్యలు తీసుకోరా  అని  గజ్వేల్,  కొండపాక మండలాల ఎంఈఓ లను  ప్రశ్నించగా ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో  చేర్పించాలని సలహాలు ఇచ్చారు. కానీ ప్రైవేటు పాఠశాలలను నియంత్రిస్తామని చెప్పకపోవడం గమనార్హం.

జగదేవ్పూర్ మండల విద్యాధికారి ఈ విషయంపై ప్రశ్నించగా ఫీజుల నియంత్రణ తమ పరిధిలో లేదని వెల్లడించారంటే రికగ్నైజేషన్  నిబంధనల గురించి  కూడా అధికారులకు తెలియ కుండానే ప్రభుత్వ గుర్తింపు, ఆమోదిత పత్రాలనును ఆయా ప్రైవేటు పాఠశాలలకు ఇస్తున్నట్లు తేటతెల్లమవుతుంది.  ములుగు ఎంఈఓ ను ప్రశ్నించగా ములుగు పరిధిలోని పాఠశాలలో   రికగ్నైజేషన్ పత్రాలలో సమర్పించిన నివేదిక ప్రకార మే ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ విషయంలో ఒక విద్యార్థి తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు.