14 April, 2026 | 1:26 PM

Breaking News

గొప్ప అభ్యుదయ వాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్   •   అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •  

అమ్మో.. ఎంత ప్రమాదకరమో!

16-12-2025 12:37 AM
  1. ప్రమాదకరంగా కొత్తకొండ రహదారి

బ్రహ్మోత్సవాలకు లక్షల్లో రానున్న భక్తులు

జనవరి రెండో వారంలో జాతర

మంత్రి పొన్నం చొరవ తీసుకోవాలి

భీమదేవరపల్లి, డిసెంబర్ 15 (విజయక్రాంతి) ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తారు రోడ్డు అనుకునే పెద్ద ఎత్తున గండ్లు పడడంతో రహదారి పలుచోట్ల పూర్తిగా ప్రమాదకరంగా మారింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లో కొత్త కొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా జనవరి మాసం రెండవ వారంలో జరుగుతాయి.

కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు పది లక్షలకు పైగా భక్తులు విచ్చేసి వీరభద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. వీరభద్రుని దర్శించేందుకు భక్తులు వేలాది గా వివిధ వాహనాల్లో వస్తుంటారు. దర్శనానికి వచ్చే భక్తులు ఏ మాత్రం అదమర్చి వాహనాన్ని నడిపితే తారు రోడ్డు పక్కనే గండ్లు పడిన చోట పడే అవకాశాలు ఉన్నాయి. జాతరకు దాదాపుగా వేల సంఖ్యలో వివిధ డిపోలో చేరిన ఆర్టీసీ బస్సులు వస్తుంటాయి.

ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డుకు ఆనుకొని ఉన్న గుంతలు పూడ్చకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వెంటనే నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.