calender_icon.png 7 July, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ పంటలను సాగు చేయాలి

07-07-2025 07:08:52 PM

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): వరి పంటకు ప్రత్యామ్నాయంగా, మూడు రెట్లు అధిక దిగుబడి ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ పంటలను సాగు చేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ్డి సూచించారు. సోమవారం ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ లో భాగంగా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో బిల్లాల సత్తి రెడ్డి  ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో, పతంజలి ఫుడ్స్ ఆయిల్ పామ్ కంపెనీ భాగస్వామ్యంతో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఆయిల్ పామ్ మొక్కను ఒకసారి నాటితే 4వ సంవత్సరం నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు ఎకరానికి 10 నుండి 12 టన్నుల దిగుబడిని ఇస్తుందని తెలిపారు.

దీని ద్వారా  ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు  ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.  పంటకు జంతువుల నుండి , దొంగల నుండి  ఎటువంటి బెడద ఉండదన్నారు. మిగతా పంటలతో పోల్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలను చీడ పీడలను తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుందని అన్నారు. ఈ పంట సాగుకు 100% రాయితీతో మొక్కలు సరఫరా చేస్తూ, మొక్కకు నీరు అందించే డ్రిప్ పరికరాలకు కూడా ప్రభుత్వం రాయితీ అందిస్తుందని పేర్కొన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలకి మొక్కల యాజమాన్యానికి ఎకరానికి 4200 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  నార్కట్పల్లి  ఉద్యాన అధికారి శ్వేత, పతంజలి ఫుడ్స్ జిల్లా జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వినయ్, శ్రీనివాస్, వంశీ, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు శేఖర్, శ్రీనివాస్ రెడ్డి  గ్రామ రైతు లు వెంకట్ రెడ్డి, సతి రెడ్డి, నర్సి రెడ్డి, రాములు, విజయ్ పాల్గొన్నారు.