07-07-2025 11:16:36 PM
సనత్నగర్ (విజయక్రాంతి): గీతకార్మిక శాఖ నూతన ఇన్చార్జిగా శ్రీ కత్తి వెంకటస్వామి గౌడ్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... “గీత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం నా ప్రధాన లక్ష్యాలు. ఈ శాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను” అని తెలిపారు. ఈ బాధ్యతను అప్పగించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి, గౌరవ మంత్రి పోన్నం ప్రభాకర్ కి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేశం నాగరాజ్ గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, ఐల మధు గౌడ్ లు కలిసి ప్రత్యేకంగా ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.