calender_icon.png 19 June, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీతో అంటకాగుతున్న అసదుద్దీన్

10-05-2024 01:11:28 AM

ఎంఐఎంపై ప్రియాంకగాంధీ విమర్శలు

రాయ్‌బరేలీ, మే 9: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ బీజేపీతో నేఉగా కలిసి పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘ప్రతిసారి నేను చెబుతున్నాను. అసదుద్దీన్ ఒవైసీ.. బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీకి అవసరం ఉన్న చోటల్లా.. వేరే పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీకి లాభం చేకూర్చేందుకు ఎంఐఎం అభ్యర్థులను బరిలో దింపుతోంది. ఇదే విషయం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది’ అని దుయ్యబట్టారు. రామమందిరంపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు.