14 April, 2026 | 5:21 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

25-10-2025 07:53 PM

తూప్రాన్,(విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్‌ లో వరి కొనుగోలు కార్యక్రమంపై తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి జయచంద్ర రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో జిపిఒలు, ఏపిఎంల, సిసి‌లు, ఓబీలకు ప్రత్యేకంగా శిక్షణతో పాటు సలహాలను అందించారు. ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రంలో రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు, అవసరాలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా, ప్రామాణిక ధరలకు వరి విక్రయించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అధికారులు, ఉద్యోగులు ఆలస్యం లేకుండా, రైతులను పూర్తిగా ఆదుకోవాలని అందరికీ స్పష్టం చేశారు. తూప్రాన్ మండలంలోని వరి కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆర్డీవో ఆదేశించారు.