1 June, 2026 | 2:28 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు

25-10-2025 10:52 PM

అయిజ: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పురుగుల మందులు తయారు చేస్తు రైతులను మోసం చేస్తున్న కేంద్రంపై పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా శనివారం దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో సూపర్ సింబోలా మైక్రోనూట్రింట్ కంపెనీ పేరు పెట్టి నకిలీ మందులు తయారు చేస్తున్న నిర్వాహకుడు బత్తిని వీరేష్ ఎలాంటి అనుమతులు లేకుండా 25 రకాల పురుగుమందులు తయారు చేస్తున్నట్లు గుర్తించామని ఈ దాడులలో రూ.4,66,800 విలువ గల పిచికారి మందులను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు వీరేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శాంతినగన్ సిఐ టాటా బాబు తెలిపారు. దాడులలో మండల వ్యవసాయ శాఖ అధికారి జనార్ధన్ ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు