13 April, 2026 | 4:23 PM

Breaking News

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •  

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సమ్మయ్యకు అవకాశం ఇవ్వాలి

25-10-2025 10:37 PM

మందమర్రి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు కాంపల్లి సమ్మయ్యకు అవకాశం కల్పించాలని ఐఎన్టియుసి కేంద్ర కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ యేకుల సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ తరుపున పోరాటం చేస్తున్న కార్మిక నేత సమ్మయ్యకే అధ్యక్ష పదవి దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం, యూనియన్ కోసం నిరంతర శ్రమిస్తున్నాడన్నారు. యూనియన్ నాయకుని పట్ల కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉండటంతో అధ్యక్ష పదవి ఆయననే వరించే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు ఆరకొండ ఆంజనేయులు, నూనె సాంబయ్య, డి మల్లికార్జున్, జే నరసింహారెడ్డిలు పాల్గొన్నారు.