పాక్ కార్గో విమానం మిస్సింగ్
ఇస్లామాబాద్, జూలై 8: పాకిస్థాన్కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం కరాచీలో ల్యాండవడానికి ముందు మిస్సయ్యింది. షార్జీ నుంచి కరాచీకి వస్తుండగా మంగళవారం రాత్రి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. బలూచిస్థాన్ సమీపంలోని అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా విమానం అదృశ్యమైనట్లు పీఏఏ (పాక్ ఎయిర్పోర్ట్ అథారిటీ) అధికారులు ప్రకటించారు.
విమానం ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు చర్యలు ప్రారంభించామని, విమానంలో ఐదుగురు ప్రయాణికులున్నారని అన్నారు. 1999లో ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ విమానాన్ని 2012 నుంచి సరుకు రవాణా కోసం వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. కాగా విమానం కూలిపోయినట్లు అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. 2020 మే నెలలోనూ కరాచీలో పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయి 97 మంది మృతి చెందారు.






