08-06-2025 08:51:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని ఎస్.ఆర్.కె లో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 1997-98 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులందరూ కూడా 27 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అప్పట్లో దిగిన ఫోటోలను, ఇప్పట్లో దిగిన ఫోటోలతో బేరీజు వేసుకుని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. గురువులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.