13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొన్న పల్లె శ్రీనివాస్‌గౌడ్

03-01-2026 12:00 AM

ఆలేరు, జనవరి 2 (విజయక్రాంతి): మండలంలోని మంతపురి గ్రామంలో జన్మించిన పల్లె శ్రీనివాసులు గౌడ్ అంచలంచలుగా ఎదుగుతూ ముందుగా ఎన్ ఎస్ యు ఐ యువజన నాయకుడగా, మంతపురి  గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీకి లేని సేవలు చేసినందుకు టి పి సి సి జనరల్ సెక్రెటరీని చేశారు.

మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటరీ ఇంచార్జిగా వరంగల్ జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేక సర్పంచి పదవులను కైవసం చేసుకునేటట్లు చేశారు. అందుకు గాను  పల్లె శ్రీనివాస్ గౌడ్ ను ప్రగతి భవన్ లో కృష్ణ, గోదావరి నది జలాలపై జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాల్గొనే అవకాశం ఇచ్చినట్లు  ఆయన తెలిపారు.