14-03-2025 01:21:19 AM
నిర్మల్ మార్చ్ 13 (విజయ క్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 100% ఆస్తి పన్నులు వసూలు చేయడం జరుగుతుందని ప్రజలు పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
పట్టణంలోని 42 వార్డులో పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని పనులపై వడ్డీ రాయితీ ఉండబోదని పేర్కొన్నారు. మార్చి 31 లోపు పన్నులు చెల్లించాలని ప్రజలకు విన్నవించారు. పన్నులు చెల్లించని వారిపై తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.