15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన పిడి బన్సీలాల్ నాయక్

11-11-2025 08:07 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో డబ్బుల వ్యవహారం రచ్చకెక్కడంతో మంగళవారం ఇందిరమ్మ పథకం పిడి బన్సీలాల్ నాయక్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఎంపికైన లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలైన అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేలా చర్యలు చేపడతామని చెప్పారు. పిడి బన్సీలాల్ నాయక్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి, బండి ప్రభాకర్, ఎండి అనీఫ్, బిఆర్ఎస్ నాయకులు జిల్లపల్లి వెంకట స్వామిలు ఉన్నారు.