08-09-2025 12:07:00 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 07 (విజయక్రాంతి): సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటుగా మండల కేంద్రాల్లో నిర్వహించిన వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, సామాన్య ప్రజానీకాని కి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పూర్తి.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వా హకులకు ఎస్పీ ఈసందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు.