17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కొమురవెల్లిలో పెద్దపట్నం

17-02-2026 01:40 AM

వేడుకలకు తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి, ఫిబ్రవరి 26: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పెద్దపట్నం వేడు కలు వైభవోపేతంగా జరిగాయి. తోట భావి ప్రాంతంలో 50 మంది ఒగ్గు పూజారులు సుమారు ఐదు గంటల పాటు శ్రమించి 50 గజాలలో పట్నాన్ని రచించారు.

పంచవర్ణాలైనా పసుపు, కుంకుమ, పచ్చ( తంగేడు ఆకు తో తయారు చేసిన పొడి ) తెల్ల పిండి, బుకా గులాల్ (గులాబీ రంగు కుంకుమ) ఉపయోగించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్దపట్నం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. గర్భాలయం నుంచి ఆలయ అనువంశిక అర్చకులు మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను  పట్నంపై పెట్టి, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.