25-09-2025 05:31:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు గ్రామపంచాయతీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని అదనపు కలెక్టర్ అదనపు కలెక్టర్ ఫైజాన్ హమ్మద్ కు వినతి పత్రం అందించారు.