4 July, 2026 | 10:11 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సీఎంఆర్ఎఫ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

17-05-2025 06:04 PM

గజ్వేల్: అనారోగ్యంతో బాధపడేవారు, ప్రమాదానికి కూడా చికిత్స పొందేవారు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి(BRS Gajwel constituency incharge Vanteru Pratap Reddy) అన్నారు.  శనివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 47 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వంలో లక్షలాదిమందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరిగిందని  తెలిపారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స కోసం ప్రజలు బయట నుండి అప్పులు చేసి వైద్యాన్ని పొందుతున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో కూడా కోతలను విధించడం,  తక్కువ డబ్బులను మంజూరు  చేయడం బాధాకరమన్నారు. గజ్వేల్ కు చెందిన గుంటుకు బాలకృష్ణ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు దాదాపు రూ.47 లక్షల వరకు ఖర్చు పెట్టారని, రూ. 47 లక్షల బిల్లును సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేస్తే  రూ. 60 వేల రూపాయలను  ప్రభుత్వం మంజూరు చేయడం చాలా దారుణమన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను పెంచి సిఎంఆర్ఎఫ్ దరఖాస్తు పెట్టుకున్న వారికి గరిష్ట మొత్తం  మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, వర్గల్ ఎంపీపీ లతా రమేష్ గౌడ్, కౌన్సిలర్లు  ఉప్పల మెట్టయ్య, మరికంటి కనకయ్య, గుంటుకు రాజు, రహీం,, హైదర్ పటేల్, ఉపేందర్ రెడ్డి, కిరణ్ గౌడ్, ఉమర్, అహ్మద్, అబ్దుల్, రాజు, కరీం లబ్ధిదారులు తదితరులున్నారు.