17-05-2025 10:36:01 PM
రైతులకు అండగా నిలుస్తున్న డీసీసీబీ..
ఉమ్మడి పాలమూరు డిసిసిబి కి ఐఏఎస్ సర్టిఫికెట్..
చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి ఐఏఎస్ సర్టిఫికెట్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రైతులకు ఎల్లప్పుడూ నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ డీసీసీబీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో డీసీసీబీ చేసిన సమర్థవంతమైన పనులను గుర్తించి ఐఎస్ఓ సర్టిఫికెట్ను సీఎం చేతుల మీదుగా డిష్ వి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి శనివారం అందుకున్నారు. అరుదైన గుర్తింపు లభించడంతో డీసీసీబీ డైరెక్టర్లు బ్యాంకు అధికారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.