30 June, 2026 | 8:41 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు..

23-09-2025 02:55 PM

ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి..

బెల్లంపల్లి అర్బన్: రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనీ ఏఐసీటీయూ, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బెల్లంపల్లిలోని అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ బోర్డు కార్మికులకు సంబంధించి యాక్సిడెంట్, నార్మల్ డెత్ లకు సంబంధించి ఎంక్వయిరీ(విచారణ) రిపోర్ట్ లేబర్ బోర్డులకు సబ్మిట్ చేయడానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా అవినీతి జరిగే ఆస్కారం ఉందన్నారు.

ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఏజెంట్లు కార్మికులను తీవ్ర ఇబ్బందులు పెడుతూ డబ్బులు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. ఏదైతే లేబర్ బోర్డు పునారాలోచించి, కార్మికుల దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరారు. పాత పద్ధతినే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని లేనియెడల లేబర్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి అరేపెల్లి రమేష్, షేక్ సర్వర్, పోచం, బాలయ్య, నవీన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.