15 July, 2026 | 3:32 PM

Breaking News

దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం   •   భవిష్యత్తులో ఏఐ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు   •   భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే   •   సీఎం ప్రోగ్రాం బాయ్ కోట్   •   ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం   •   సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్   •  

రేబిస్ వ్యాధిపై పెంపుడు కుక్కల యజమానులు అవగాహన కలిగి ఉండాలి

28-09-2025 05:01 PM

జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఈ. శంకర్ 

బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రస్తుతం అత్యంత ప్రమాదకమైన రేబిస్ వ్యాధిపై ప్రజలు, పెంపుడు కుక్కల యజమానులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఈ.శంకర్ సూచించారు. ఆదివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పశు వైద్యశాల వద్ద పశు వైద్యాధికారి డాక్టర్ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ రేబిస్ వ్యాక్సినేషన్ శిబిరంలో పాల్గొని పెంపుడు కుక్కల యజమానులకు రేబిస్ వ్యాధి సంక్రమణ పట్ల అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వ్యాధికి టీకా అందుబాటులో ఉందని చెప్పారు.

ప్రజల్లో రేబిస్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల కుక్క కాటు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.కుక్క కాటు వల్ల మనుషులతో పాటు ఇతర జంతువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. పెంపుడు కుక్కలకు సమయానికి రేబిస్ టీకా వేయిస్తే ఈ వ్యాధి నుండి రక్షించవచ్చని సూచించారు. అనంతరం పశు వైద్యశాల వద్ద పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ పి. శ్రావణ్, గోపాలమిత్ర సభ్యులు తిరుపతి, వెంకటేష్, ప్రశాంత్ లు పాల్గొన్నారు.