13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పేద ప్రజల ఆత్మబంధువు పీజేఆర్

13-01-2026 02:39 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ 

జూబ్లీహిల్స్, జనవరి12 (విజయక్రాంతి): దివంగత పి.జనార్దన్ రెడ్డి (పిజెఆర్) పేద ప్రజల ఆత్మబంధువు అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.పిజెఆర్ జయంతిని యూసుఫ్ గూడ చౌరస్తాలో సోమవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్యే పిజెఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కార్మిక నేతగా ఎంతో మంది జీవితాల్లో పిజెఆర్ వెలుగులు నింపారన్నారు.బడుగు,బలహీన వర్గాలకు చెందిన ప్రజల పక్షాన నిలిచి వారి హక్కుల కోసం పోరాడారన్నారు.అటువంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవడం, ప్రజల కోసం ఆయన చూపిన బాటలో పని చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పిజెఆర్ అభిమానులు తదితరులున్నారు.