22 May, 2026 | 3:42 PM

Breaking News

మార్కెట్లో నిండుకున్న జొన్న మొక్కజొన్న పంట   •   బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం   •   శ్రీ కృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు   •   దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం   •   ఎండిన వాగుకు జీవం పోస్తున్న చెక్ డ్యాములు   •   అడ్మిషన్ లు ప్రారంభం.. విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే   •   భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు   •   మక్కలు వెంటనే తరలించాలని తహసీల్దార్ కు వినతి   •  

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

10-09-2025 08:21 PM

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్(District Minority Welfare Officer Srinivas) పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా సమీపంలో అధికారులు, ఉపాధి హామీ కూలీలతో కలిసి వివిధ రకాల మొక్కలు నాటి, నీరు పోశారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని, విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి,టీఏ దీపిక,పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.