23 May, 2026 | 2:28 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటితరం ప్రతి ఒక్కరికి ఆదర్శం

10-09-2025 10:28 PM

హుజూర్ నగర్ మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్..

హుజూర్‌నగర్: తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ చూపిన తెగువ పోరాట స్పూర్తి నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని హుజూర్ నగర్ మాజీ ఎంపీపీ, రాష్ట్ర రజక సంఘం నాయకులు గూడెపు శ్రీనివాస్ అన్నారు. గురువారం చిట్యాల ఐలమ్మ 40వ ర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఐలమ్మ పోరాట స్పూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి నాగేశ్వరరావు, ఆదూరి కిషోర్ రెడ్డి, దుగ్గి వర్మ, గూడెపు నాగలింగం, మీసాల కిరణ్, ఉదారి యాదగిరి, దగ్గుపాటి బాబురావు, దుగ్గి నరసింహరావు, కిస్టపాటి సైదిరెడ్డి, ముషం సత్యనారాయణ, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.