calender_icon.png 5 June, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకలజనుల సమ్మె ఉద్యమకారులను పట్టించుకోండి

02-06-2025 02:27:48 AM

మహబూబ్ నగర్ టౌన్ జూన్ 1 : స్వరాష్ట్ర సాధనకై 2011లో జరిగిన సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యమకారుల కోర్టు కేసులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిbమంత్రి జూపల్లి కృష్ణారావు కలుగజేసుకొని మాఫీ చేయించాలని టిఎన్జీఓల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రా నాయక్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

28 మంది ఉద్యమకారులు 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ అప్పటి సమ్మె కేసులో కోర్టు వాయిదా లతో కోర్టు చుట్టూ తిరగలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినో త్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడానికి జిల్లాకు వస్తున్న పర్యాటక,ఎక్సైజ్ శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి కేసులను మాఫీ చేయించాలని కోరారు.