02-06-2025 02:25:28 AM
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్
మహబూబ్ నగర్ జూన్ 1 (విజయ క్రాంతి) : ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి పదిలంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 43వ వార్డు రామ్ నగర్ లో మహిళల కొరకు ప్రత్యేకంగా ఆరోగ్య క్యాంపు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య చికిత్సలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 43 వ వార్డు అధ్యక్షులు శరత్ రెడ్డి తదితరులు ఉన్నారు.