4 May, 2026 | 3:08 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

గ్యాస్, చమురు నిల్వలు ఎంత ఉన్నాయో చెప్పండి

20-03-2026 01:21 AM

ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ, మార్చి 19: ఇజ్రాయోల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ప్రపంచ దే శాలు ఉక్కిరిబిక్కిరి ఆవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఆందోళన నెలకొం ది. దేశంలో ఇంధన, గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది.

దేశంలోని చము రు, గ్యాస్ కంపెనీల వద్ద ఉన్న నిల్వలు, ఉత్ప త్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చే సింది. ఈ మేరకు దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, సహజవాయువు సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ జారీచేసింది. ఆయా కంపెనీలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ వివరాలను పంపించాల్సి ఉంటుంది.  

ఇరాన్‌లో వెయ్యి మంది..

సుమారు వెయ్యి మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నారని విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి కేంద్రం వెల్లడించింది. కా గా ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతా ల్లోని 23 వేల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాయలేకపోయారని పేర్కొంది.