29 April, 2026 | 10:53 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్

09-08-2025 03:04 AM
  1. ఏడాది చివర్లో వార్షిక సమావేశం.. భారత్‌కు రావాలని ఆహ్వానం
  2. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాలను వివరించిన పుతిన్
  3. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మోదీ సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 8: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. భారత్‌లో పర్యటించాలని ఈ సందర్భంగా పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. ఈ ఏడాది చివరిలో 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సద స్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కా వాలని పుతిన్‌ను మోదీ కోరారు. అనంతరం భారత్, రష్యా దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంపై చర్చించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యు ద్ధం తాజా పరిణామాలను ప్రధాని మోదీకి పుతిన్ వివరించారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్క రించుకోవాలని పుతిన్‌కు మోదీ సూచించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా కూడా పంచుకున్నారు.

అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ.. భారత ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో వాణిజ్యం, దౌత్య సంబ ం ధాల పటిష్టంపై మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను చర్చల కోసం రష్యా కు పంపించారు.