calender_icon.png 9 August, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్

09-08-2025 03:04:43 AM

  1. ఏడాది చివర్లో వార్షిక సమావేశం.. భారత్‌కు రావాలని ఆహ్వానం
  2. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాలను వివరించిన పుతిన్
  3. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మోదీ సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 8: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. భారత్‌లో పర్యటించాలని ఈ సందర్భంగా పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. ఈ ఏడాది చివరిలో 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సద స్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కా వాలని పుతిన్‌ను మోదీ కోరారు. అనంతరం భారత్, రష్యా దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంపై చర్చించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యు ద్ధం తాజా పరిణామాలను ప్రధాని మోదీకి పుతిన్ వివరించారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్క రించుకోవాలని పుతిన్‌కు మోదీ సూచించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా కూడా పంచుకున్నారు.

అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ.. భారత ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో వాణిజ్యం, దౌత్య సంబ ం ధాల పటిష్టంపై మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను చర్చల కోసం రష్యా కు పంపించారు.