26 March, 2026 | 10:45 PM

అస్రానీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

21-10-2025 10:20 AM

న్యూఢిల్లీ: నటుడు గోవర్ధన్ అస్రానీ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సంతాపం తెలిపారు. తరతరాలుగా ప్రేక్షకులను అలరించిన అస్రానీ నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయనను గుర్తు చేసుకున్నారు. 84 ఏళ్ల అస్రానీ సోమవారం ముంబైలో తుది శ్వాస విడిచారు. "శ్రీ గోవర్ధన్ అస్రానీ జీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతిభావంతులైన ఎంటర్‌టైనర్, నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన తరతరాలుగా ప్రేక్షకులను అలరించారు" అని ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆయన తన మరపురాని ప్రదర్శనల ద్వారా లెక్కలేనన్ని జీవితాలకు ఆనందాన్ని, నవ్వును జోడించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి" అని ప్రధానమంత్రి అన్నారు.

ఐదు దశాబ్దాలుగా 300 కి పైగా చిత్రాలలో నటించిన అస్రానీ, షోలే, నమక్ హరామ్, గుడ్డి చిత్రాలలో మరపురాని పాత్రలను పోషించిన ఆతను హాస్య సమయస్ఫూర్తికి ప్రసిద్ధి చెందారు.