పారా అథ్లెట్లపై ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: భారత పారా అథ్లెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశల జల్లు కురిపించారు. ఇటీవల జపాన్ వేదికగా జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 17 పతకాలతో మన అథ్లెట్లు సత్తా చాటారు. పారా అథ్లెట్లు సాధించిన ఈ విజయం అత్యంత గొప్పదని మోదీ కొనియాడారు. పారా అథ్లెట్ల ప్రదర్శనపై ప్రధాని మోదీ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మన అథ్లెట్ల ప్రదర్శన అద్భుతం. ఈసారి చాంపియన్షిప్లో రికార్డు స్థాయి లో 17 పతకాలు కొల్లగొట్టి దేశ ఖ్యాతిని మరింత పెంచారు. ఇంతటి గొప్ప విజయం వెనుక ప్రతి పారా అథ్లెట్ కృషి, కఠోరశ్రమ దాగుంది’ అని మోదీ పేర్కొన్నారు. కాగా వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 17 పతకాలు కైవసం చేసుకోగా ఇందులో ఆరు స్వర్ణాలు ఉన్నాయి.






